Monday, April 29, 2024

రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థికి మాయావతి మద్దతు

బీఎస్పీ చీఫ్‌ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి ఓట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించాం. తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడంలేదు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం’ అని మాయావతి చెప్పారు. కాగా, మద్దతు అంశంపై ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement