Sunday, April 28, 2024

Bijapur : ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రుగ‌గా, ఓ మావోయిస్టు మృతిచెందిన ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా కైకా మౌస్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుడిని మావోయిస్టు డిప్యూటీ కమాండర్‌ పూనెం రితేశ్‌గా గుర్తించామన్నారు. అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement