Thursday, May 2, 2024

హిజ్రాతో ప్రేమ పెళ్లి.. ఆదర్శ వివాహం చేసుకున్న యువకుడు

సమాజంలో హిజ్రాలను చిన్న చూపుతో చూస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు పెద్దలను ఒప్పించి మరీ ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల(రేవతి) అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరి మధ్య స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఇల్లెందులోని స్టేషన్‌ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా రహస్యంగా సహజీవనం చేస్తున్నారు.

చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలంటున్నా, చీత్కారాలు ఎదురైనా ఇద్దరూ ఒకరి చేయి ఒకరు విడువలేదు. అయితే ఇంకెంతకాలం కన్నవారిని మోసం చేస్తూ ఇలా బ్రతకాలి అనుకున్న రూపేశ్… ధైర్యం తెచ్చుకుని తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేశాడు. అందరి పేరెంట్స్‌లాగే ఆ మాట వినగానే వారు కంగారుపడ్డారు. హిజ్రా కోడలిగా వస్తే ఒప్పుకోమన్నారు. అయితే రూపేశ్ తన ప్రేమను ఇంట్లో వాళ్లకు వివరించి చివరికి ఒప్పించాడు. మంగళ వాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో శుక్రవారం(మార్చి 11) అఖిల మెడలో తాళి కట్టి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement