Monday, April 29, 2024

మ‌ల‌యాళ న‌టుడు ‘ప్ర‌దీప్ కొట్టాయం’ మృతి – సంతాపం వ్య‌క్తం చేసిన చిత్ర ప‌రిశ్ర‌మ‌

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు, క‌మెడియ‌న్ ప్ర‌దీప్ కొట్టాయం క‌న్నుమూశారు. హార్ట్ ఎటాక్ తో ఆయ‌న మృతి చెందారు. 2001 లో సినీ కెరీర్ ప్రారంభించ ప్రదీప్..70కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా మళయాళ ఇండస్ట్రీలోనే పనిచేశారు. తెలుగులో గౌతంమీనన్ దర్శకత్వంలో నాగచైతన్య- సమంత జంటగా వచ్చిన ‘ ఏ మాయ చేశావే’ సినిమాలో హీరోయిన్ సమంత అంకుల్ పాత్రలో ‘ అంకుల్ జార్జ్’ పాత్రలో నటించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యారు. పరీతమైన హాస్యం,డైలాగ్ డెలివరీకి పేరుగాంచిన కొట్టాయం ప్రదీప్ ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘లైఫ్ ఆఫ్ జోసుట్టి’, ‘కుంజిరామాయణం’, ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’ వంటి మళయాళ సినిమాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటించారు. ఆయన మృతికి మళయాళ చిత్ర పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement