Monday, May 20, 2024

దేశంలోని సీఎం, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ‘మ‌మ‌తాబెన‌ర్జీ’ లేఖ‌

వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌త‌బెన‌ర్జీ దేశంలోని సీఎం, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల‌కు లెట‌ర్ రాశారు. ప్రజా స్వామ్యం పై భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష దాడులకు దిగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు… బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరితో సమావేశం కావాలని ఆ లేఖలో కోరారు. అంతే కాదు బీజేపీ వ్యతిరేక సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ఒకటి కావాలన్నారు. అలాగైతేనే కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్ని పడగొట్ట వచ్చని ఆమె తెలిపారు. దీని కోసం దేశంలోని ఎన్డీఏ యేతర పార్టీలన్నీ ఒకటి కావాలని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ. ప్రతి పార్టీ దీనిపై స్పందించి.. ముందుకు రావాలని లేఖలో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement