Thursday, May 2, 2024

త్రివిక్ర‌మ్ తో మ‌హేశ్ బాబు 28వ చిత్రం – క్లాప్ కొట్టిన న‌మ్ర‌త‌

ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తో ప‌లు చిత్రాల్లో న‌టించాడు టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు. కాగా త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో మహేశ్ 28వ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు రామానాయుడు స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది. కాగా మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ చేతుల మీదుగా సినిమాను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆమె క్లాప్ కొట్టారు. మహేశ్ కు జోడీగా.. పూజా హెగ్డే నటించనుంది. మహర్షి తర్వాత ఆమె మరోసారి మహేశ్ తో న‌టించ‌నుంది.
ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలు కానుంది. ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు సమకూర్చనున్నాడు. సినిమాపై మహేశ్ కూడా కామెంట్ చేశాడు. మరో కొత్త చాప్టర్ మొదలైందంటూ ట్వీట్ చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement