Friday, May 17, 2024

ఈయనకు మళయాలంలో ట్వీటితే. ఆయనకు అరబ్​లో ట్వీటాడు.. వెరీ ఇంట్రెస్టింగ్​

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని ఎమిరేట్స్ లో భేటీ అయిన వెంటనే యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని మలయాళంలో ట్వీట్​ చేశారు.  ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ట్వీట్‌తో పాటు దుబాయ్ ఎక్స్ పో 2020 వేదికపై విజయన్‌కు ఇచ్చిన ఆతిథ్యం ఫొటోను కూడా ఆయన షేర్​ చేశారు. కాగా, ఈ ట్వీట్‌ను  సీఎం విజయన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రీ ట్వీట్​చేయడం కనిపించింది.

“యుఏఈ  కేరళతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంది.  దుబాయ్,  యూఏఈల ఆర్థిక,  అభివృద్ధిలో కేరళీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు” అని దుబాయ్​ ప్రధాని మలయాళంలో రాశారు.  అంతే ఆసక్తిని రేకెత్తించేలా కేరళ  ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కూడా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు అరబిక్ లో ట్వీట్ చేసి థ్యాంక్స్​ చెప్పడం మరింత సంచలనంగా మారింది. నిన్న జరిగిన వారి సమావేశంలో కేరళ అభివృద్ధిలో తమకు ఇంపార్టెన్స్​ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి విజయన్​కు యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement