Thursday, May 2, 2024

లారీ – ప్రైవేట్ బ‌స్సు ఢీ – తొమ్మిది మంది మృతి

లారీ ..ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది మ‌ర‌ణించారు..23మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ప్ర‌మాదం కర్నాటక హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా బైపాస్‌ వద్ద చోటు చేసుకున్నది. కొల్లాపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ, ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు ఢీకొట్టుకున్నాయి.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనిర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుంబీలోని ఆసుప్రతికి క్షతగాత్రులను తరలించారు. 23 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను హుబ్లీ కమిషనర్‌ పరామర్శించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement