Thursday, April 18, 2024

లేడీ సింగ‌ర్ దారుణ హ‌త్య‌.. డెడ్‌బాడీపై లో దుస్తులు త‌ప్పా మ‌రేం లేవు..

హర్యానాలో దారుణం జరిగింది. 12 రోజుల క్రితం అదృశ్యమైన ఓ సింగ‌ర్‌ దారుణ హత్యకు గురైంది. దుండగులు గాయని మృతదేహాన్ని రోహ్‌తక్ జిల్లాలోని భైరోన్ భైనీ అనే ఊరు సమీపంలో జాతీయ రహదారి పక్కన పూడ్చిపెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగుచూసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, మృతురాల త‌న ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఓ మ్యూజిక్ వీడియో షూట్ నిమిత్తం రవి, రోహిత్ అనే ఇద్దరితో కలిసి ఆమె భీవని ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే.. వాళ్లిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని మృతురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ కేసుపై పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వారు ఆరోపించడం గమనార్హం. మరోవైపు, ఈ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు రోహ్‌తక్ జిల్లాలోని మేషం పట్టణంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్థానిక హోటల్లో ఆ గాయని రవి, రోహిత్‌లతో కలిసి డిన్నర్ చేసినట్లు అందులో స్పష్టంగా కనిపించింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గాయని మృతదేహానికి ఆటోస్పై నిర్వహిస్తే హత్యకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు ఆమె కుటుంబ స‌భ్యులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement