Thursday, May 2, 2024

ఫైర్ ట్రక్కుని ఢీకొట్టిన విమానం.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి

లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వేపై ఫైర్ ట్రక్క్ ని ఢీ కొట్టింది లాటం ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం.దీంతో విమానం నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని.. మరో ఉద్యోగి గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెరూలోని ఓ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement