Tuesday, April 30, 2024

బోల్తా ప‌డిన థ‌మ్స్ అప్ బాటిల్స్ లోడు లారీ – స‌రుకు ఖాళీ చేసిన ప్ర‌యాణికులు

థ‌మ్స్ అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట సమీపంలో జరిగింది. థమ్స్‌అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ ఓఆర్ఆర్‌పై వెళ్తూ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. కాగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్అప్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. గాయాలతో మూలుగుతున్న డ్రైవర్, క్లీనర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా క్షణాల్లోనే లారీలోని సరుకు మొత్తాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement