Sunday, May 5, 2024

రూ.55 కోట్ల‌కు లైగ‌ర్ డిజిట‌ల్.. శాటిలైట్‌ హ‌క్కులు-కొనుగోలు చేసిన స్టార్ గ్రూప్

ట్రైల‌ర్ తో విధ్వంసం సృష్టించారు లైగ‌ర్ చిత్ర టీం. ఈ మూవీలో హీరోగా విజయ్ దేవ‌ర‌కొండ‌..హీరోయిన్ గా అన‌న్య‌పాండే న‌టిస్తున్నారు.పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. వీళ్ళ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు.

ఈ చిత్రం ఆగ‌స్టు 25న‌ తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. లైగ‌ర్ సినిమాకున్న క్రేజ్ నేప‌థ్యంలో ఈ చిత్ర శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడ‌య్యాయి. ప్ర‌ముఖ దిగ్గ‌జ సంస్థ స్టార్ గ్రూప్ రూ.55 కోట్ల‌కు లైగ‌ర్ డిజిట‌ల్. శాటిలైట్‌ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. ను కొనుగోలు చేసింది. ఓ టైర్2 హీరోకు ఈ రెంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుందంటే విశేషం అనే చెప్పాలి. పైగా విజ‌య్ న‌టించిన గ‌త మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌లేదు. ఇక‌ ‘లైగ‌ర్’ విష‌యానికొస్తే ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఈ చిత్రంలో విజ‌య్‌కు జోడీగా అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement