Saturday, May 18, 2024

మెడికల్ కాలేజీలో తెగిపడ్డ లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి సీరియస్

తెలంగాణలో ఘోర ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన లిప్టు ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఉన్న ఆర్‌వీఎం మెడికల్ కాలేజీలో జరిగింది. ఆర్‌వీఎం వైద్య కళాశాలలో ప్రమాదవశాత్తు లిప్టు తెగిపడింది. తీగలు తెగడంతో ఒక్కసారిగా పై అంతస్తు నుంచి లిప్టు కిందపడింది.

ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ పరిధిలో ఉన్న సవారియా ఇనుపపైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. క్రేన్‌ సహాయంతో ఇనుపరాడ్లు తీసుకెళుతున్న సమయంలో.. బరువు ఎక్కువై వైరు తెగిపోయింది. ఒక్కసారిగా ఇనుపరాడ్లు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లు నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement