Thursday, May 16, 2024

ల‌తా మంగేష్క‌ర్ పెద్ద సోద‌రి లాంటివారు – ప్ర‌ధాని మోడీ

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ త‌న పెద్ద సోద‌రి అని ప్ర‌ధాని మోడీ అన్నారు. ల‌తా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డును మొదటిగా ప్రధాని మోడీ స్వీకరించారు. ముంబైలో జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమంలో.. లతా మంగేష్కర్ కు ఆమె సోదరి ఆశాభోంస్లే ఘనంగా నివాళి అర్పించారు. ఆయేగా ఆనేవాలా’ పేరుతో లతా ఒకప్పుడు ఆలపించిన మధుర గీతాన్ని ఆశాభోంస్లే తన స్వరాన అంతే మధురంగా ఆలపించారు. ప్రధాని మోడీ సహా ఈ సభకు హాజరైన వారు ఆసక్తిగా వీక్షించారు. లతా మంగేష్కర్ స్వరం 80 ఏళ్లకు పైగా.. గ్రామఫోన్ నుంచి సీడీ, డీవీడీ, పెన్ డ్రైవ్, డిజిటల్ మ్యూజిక్ యాప్ ల వరకు ఎన్నో తరాలను పరవశింపజేసినట్టు ప్రధానిమోడీ ఈ సందర్భంగా కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement