Sunday, April 28, 2024

Lata Mangeshkar Biography: దివికేగిన గాన కోకిల.. లతా మంగేష్కర్‌ జీవిత ప్రయాణం సాగిందిలా..

భారత దిగ్గజ సినీ గాయని, గాన కోకిల లతా మంగేష్కర్‌ మృతితో సిని పరిశ్రమలో విషాదం నింపింది. ఆమె ఇక‌లేరన్న వార్త‌ను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గాయ‌నిగా ఎవ‌రికీ అంద‌ని రికార్డుల‌ను సొంతం చేసుకున్న ఆమె పాట‌ల‌ను దేశ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర్చిపోలేరు. లతా మంగేష్కర్ 1929, సెప్టెంబరు 28న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు ఆమె మొదటి సంతానం. గానకోకిల బిరుదుతో వెలుగొందారు. ల‌తా మంగేష్క‌ర్‌ 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడి, అన్ని పాట‌లు పాడిన‌ ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. మరాఠీ సినిమా గజాభావులో లతా మంగేష్కర్ తొలి పాట పాడారు. లతా వాయిస్ పీలగా వుందంటూ మొదట్లో తిరస్కరించారు. అయితే, అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. భారత దేశ గర్వించదగ్గ గాయనిగా చరిత్ర సృష్టించారు. 1955లోనే లతా మంగేష్కర్ మ్యూజిక్ డైరెక్షన్ మొదలు పెట్టారు.

లతా తెలుగులోనూ అనేక పాట‌లు పాడారు. 1955లో నాగేశ్వ‌ర‌రావు సినిమా సంతానంలో ‘నిదుర పోరా తమ్ముడా’ పాట‌, 1965లో ఎన్టీఆర్ సినిమా ‘దొరికితే దొంగలు’లో శ్రీ వేంకటేశ పాట, 1988 లో నాగార్జున ‘ఆఖరి పోరాటం’ సినిమాలో తెల్ల చీర పాట పాడారు. ల‌తా మంగేష్క‌ర్‌కు నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగానూ పేరు ఉంది. త‌న కెరీర్‌లో ఆమె దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీలో ఆమె పాడిన పాటు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆమెకు 2001లో భార‌తర‌త్న అందించింది. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన వ్యక్తి ల‌తా మంగేష్క‌ర్‌ ఒక్కరే. 1999లో ఆమె ప‌ద్మ విభూషణ్, 1969లో పద్మభూషణ్  కూడా అందుకున్నారు. 2006లో ఆమెకు ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ది లీజియన్ అఫ్ హానర్ పుర‌స్కారం అంద‌జేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement