Friday, May 3, 2024

తెలంగాణ‌లో భూ’మ్’ వేలం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల ఏడాది భారీ వ్యయాలకు దీటుగా ఆదాయార్జన దిశగా ప్రభుత్వం వ్యూహా లు ఖరారు చేస్తోంది. ముందస్తుగా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌తో రూ. 4 వేల కోట్ల ఆదాయం ఈ నెలలో సమకూరనుండగా, మిగతా మార్గాలపై సర్కార్‌ ఫోకస్‌ పెంచింది. కొత్త పథకాలతో ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు, ఈ నెలరోజు ల్లో అదనంగా ఒక్క రైతురుణ మాఫీకే రూ.2 0వేల కోట్ల మేర సమీకరించు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొత్తగా గృహలక్ష్మి ఈ నెలలో పట్టాలెక్కనుండగా, బీసీలకు బీసీ బంధు, దివ్యాంగు లకు పెరిగిన పింఛన్లు ఖజానాకు భారం కానున్నాయి. అదేవిధంగా మైనార్టీలకు ఆర్ధిక సాయం, పెరిగిన ఇమాం, మౌజమ్‌ల వేతనాలు. తాజాగా అసెంబ్లిdలో ప్రకటించిన అనేక హామీలతోపాటుగా వీఆర్‌ఏలను, ఆర్టీసీ ఉద్యోగులను, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయడంతో పెరిగే పే స్కేల్‌కు అనుగుణంగా భారీగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఎన్ని కల్లోగా పీఆర్సీ అమలు చేసిన పక్షంలో మరో రూ. 4నుంచి 5వేలకోట్లకుపైగా అదనపు భారం వేతనాల ఖాతాలో పడ నున్నది.

ఇలా ప్రభుత్వ ఖర్చులు విపరీతంగా పెరగ నుండగా, ఆదాయం మాత్రం ఏమంత ఆశాజన కంగా లేకుండా పోతోంది. మరోవైపు అప్పుల సేకరణకూడా ఇప్పటికీ ఇబ్బందిగానే ఉండ టంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఎన్నికల ఏడాది ముగింపు నకు చేరడంతో పన్నేతర ఆదాయాల దిశగా ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయాలతో తక్షణమే రూ. 10వేల కోట్లు, ప్రైవేట్‌ భూముల పూలింగ్‌తో వెంచర్లు వేసి రూ. 5వేల కోట్లు, క్రమబద్దీకరణ లతో రూ. 5వేల కోట్లను, వీలైతే అసైన్డ్‌ భూముల క్రమబద్దీ కరణ వంటి చర్యలను ప్రభుత్వం గతంలో క్యాబినెట్‌ ఆమోదించిన ల్యాండ్‌ పూలింగ్‌ అంశాన్ని తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల సమగ్ర ప్రణాళికాబద్ద అభివృద్ధి, ఆర్ధిక స్వయం ప్రతిపత్తితోపాటు ఆర్ధిక స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నది. 20 పట్టణాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ విధానంతో నగరపాలికలు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లో ఈ విధానం అమలుకు పూనుకుంటోంది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల్లో 21,510 ఎకరాలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పద్ధతిలో ప్రైవేటు భూములను సేకరించి ప్లాట్లుగా అభివృద్ధిపర్చి అందులోనుంచి ఎకరాకు 1200నుంచి 2వేల గజాల వరకు భూ యజమానికి ఇవ్వనున్నారు. ఈ మేరకు గత ప్రతిపాదనలను పున: పరిశీలన చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను సమీకరించి లే అవుట్లుగా అభివృద్ధిపర్చి అన్ని సదుపాయాలతో విక్రయించుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తోంది. 2500 ఎకరాల్లో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న భూములను వెంచర్లుగా అభివృద్ధిపర్చి రూ.20వేల కోట్ల సాధనకు వ్యూహం ఖరారు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లనుంచి వివరాలను సేకరించింది.

సొంత లే అవుట్లు…
ఒకవైపు క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే మరోవైపు ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఈ ఏడాది పన్నేతర ఆదాయాల్లో భాగంగా భూముల అమ్మకాలతో రూ. 25,421కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు పెద్దగా ఆదాయం సమకూరలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చెల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్‌ కింద 2500ఎకరాలతో రూ. 5వేల కోట్లను పొందేలా ప్లాన్‌ వేసింది. ంతా అనుకున్నట్లుగా జరిగితే చట్టసవరణతో హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్‌ భూములపై కూడా సర్కార్‌ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేసినా ఇక అసెంబ్లిd సమావేశాలు ముగియడంతో చట్టానికి సవరణ అవకాశం లేకుండా పోయింది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.

జిల్లాల వారీగా వెంచర్లు….
రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాలతో మరోసారి భారీ రాబడికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ప్లాట్లకు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా జిల్లాల్లో వెంచర్లను డెవలప్‌చేసి రూ. వేల కోట్ల లక్ష్యం దిశగా రంగంలోకి దిగింది. గతేడాది కోల్పోయిన పన్నేతర ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఇందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను సేకరించి నివేదిక రెడీ చేసింది. ఈ దఫా ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు భూములతో భారీగా వెంచర్లు వేసేలా కీలక ప్రణాళిక సిద్దం చేసుకున్నది.

- Advertisement -

హెచ్‌ఎండీఏ లే అవుట్ల ప్లాట్ల వేలం స్టార్ట్‌…
మరోసారి హెచ్‌ఎండీ అభివృద్ధి చేసిన లే అవుట్లలో పాట్ల ఆన్‌లైన్‌ వేలంతో భారీ రాబడికి ప్రభుత్వం సన్నద్ధమైంది. రెండు మూడు వెంచర్లకు భారీ డిమాండ్‌ వ్యక్తమవడం, దేశ చరిత్రలోనే రికార్డు ధరలు పలకడంతో మరింత పకడ్బందీగా విక్రయాలను చేపట్టేందుకు సన్నద్దమవుతోంది. ఎటువంటి అక్రమాలకు వీలు లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించడం, ఆ తర్వాత లాటరీల ద్వారా ప్లాట్ల కేటాయింపులకు రంగం సిద్థం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల వేలంతో ఈ దఫా రూ. 6500కోట్ల ఆర్జనకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

తొలి దశ ఇక్కడే…
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జనలో భాగంగా పన్నేతర రాబడులపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయాలకు చర్యలు తీసుకున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలోని స్థలాల విక్రయంతో రూ. 6500 కోట్లు ఆర్జించే లక్ష్యంతో ఈ వేలం నిర్వహిస్తోంది. ఒకవైపు భూముల విక్రయంతోపాటుగానే మరోవైపు గతంలో నిల్చిపోయిన లే అవుట్ల క్రమబద్దీకరణ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 633 వెంచర్లను గుర్తించారు. వీటితో మరో రూ. 500కోట్లు రానుందని అంచనా వేస్తున్నారు. తొలి దశలో వీటికి రంగం సిద్దం చేశారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement