Sunday, April 28, 2024

Lance Naik: సాయి తేజకు కన్నీటి వీడ్కోలు..

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందిన లాన్స్‌ నాయక్‌ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. సాయి తేజ సొంత ఊరు చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. సైనిక లాఛనాలతో అంత్యక్రియులు నిర్వహించారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది.

అంతకు ముందు.. వలసపల్లి నుంచి ఎగువరేగడపల్లి వరకు సాయి తేజ అంతిమ యాత్ర కొనసాగింది. దారి పొడవునా సాయితేజలకు ప్రజలు ఘననివాళి అర్పించారు. భౌతిక కాయం చేడగానే సాయితేజ భార్య సొమ్మసిల్లి పడిపోయారు. కన్నీరుమున్నీరుగా సాయితేజ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. 

కాగా, తమిళనాడులో ఆర్మీ తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, మరో 13 మందితో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లాన్స్‌ నాయక్‌ సాయి తేజ కూడా మరణించారు. వీరజవాను సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సాయితేజ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement