Friday, May 17, 2024

ల‌లిత్ మోడీకి రెండు వారాల్లో రెండుసార్లు క‌రోనా.. ఆక్సిజ‌న్ స‌పోర్ట్ తో చికిత్స

తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు ఐపీఎల్ మాజీ ఛైర్మ‌న్ ల‌లిత్ మోడీ. రెండు వారాల్లో రెండుసార్లు క‌రోనా బారిన ప‌డ్డారు. అంతేకాకుండా ఆయ‌న న్యూమోనియాతో కూడా బాధ‌ప‌డుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. తాను అనారోగ్యం బారిన పడిన విషయాన్ని ఆయన స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. రెండు వారాల్లో తనకు రెండు సార్లు కరోనా వచ్చిందని ఆయన చెప్పారు. న్యుమోనియా కూడా తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలిపారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పలువుడు ఆకాంక్షిస్తున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అని హర్భజన్ మెసేజ్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement