రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. గోదావరి నది భారీ వరద దృష్ట్యా ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకమై స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రి అజయ్ కుమార్ ని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. శుక్రవారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాల్లో మోకాలిలోతు నీటిలో పర్యటిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement