Friday, May 10, 2024

ఐటీఐఆర్ పై పది లేఖలు రాశాం . అడ్డగోలు బుకాయింపా?….

హైదరాబాద్ ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై స్థానిక బీజేపీ నేతలు దుష్ట్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి సంజయ్‌ దోత్రే చేసిన ప్రకటనపై కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజు నుంచే ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది, చేస్తున్నదని మంత్రి వివరించారు. 2014 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఒక లేఖను సైతం రాశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత 10 సార్లు కేంద్ర ప్రభు త్వానికి వివిధ సందర్భాల్లో లేఖల ద్వారా, ప్రత్యక్షంగా కలిసి ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. తాజాగా కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మం త్రి సంజయ్‌ దోత్రే ఇచ్చిన సమా ధానం పట్ల మంత్రి కేటీఆర్‌ అసం తృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభు త్వాన్ని ఐటీఐఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమా చారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం లోక్‌స భను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం అడిగిన పూర్తి సమాచారంతోపాటు డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌(డీపీఆర్‌)ను సైతం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమరించినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత ఐటీఐఆర్‌కు సంబంధించి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని సైతం కేంద్ర మంత్రి దాచిపెట్టారని మంత్రి వెల్లడించారు. గత హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం ఐటీఐఆర్‌పైన ఎలాంటి సమాచారం సమర్పించ లేదన్న మాట చెప్పినప్పుడు, 2016లో తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని వివరించి వచ్చానన్నారు. డీపీఆర్‌ను సైతం అందించిన విషయాన్ని కేటీఆర్‌ గురు ్తచేశారు. కనీసం ఇప్పుడైనా ఐటీఐఆర్‌ను హైదరా బాద్‌కు తీసు కువచ్చేలా చర్యలు తీసు కోవాలని బండారు దత్తాత్రేయకు ఆనాడు కోరిన విషయాన్ని ఈ సంద ర్భంగా మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.
స్థానిక బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 జూన్‌ నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీఐఆర్‌పై సత్వర నిర్ణయం తీసు కొని హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకి మరింత ఊతం అందించాలని పదే పదే విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఐటీఐఆర్‌కు సంబం ధించిన డీపీఆర్‌ సమర్పిం చింద న్నారు. ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్టదాఖలు చేసిన కేంద్రం పూర్తిగా ఐటీఐఆర్‌ని రద్దు చేసిందన్నారు. ఈమేరకు తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధా నంలోనూ ఐటీఐఆర్‌ను రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు. కేవలం అసత్యాలు, దుష్ప్రచారాలతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టాలనే బీజేపీ వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement