Friday, May 17, 2024

హైదరాబాద్ : సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ 22కి వాయిదా

ఏపీ సీఎం జగన్ పై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 22కు వాయిదాపడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చెపట్ట వచ్చంటూ వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశామనీ, అందుకే ఈడీ కేసుల విచారణను వాయిదా వేయాలని విజయసాయి తరఫు న్యాయవాది కోర్టును అనమతించారు. ఇందకు సీబీఐ కోర్టు అనమతి ఇస్తూ కేసు విచారణనుసీబీఐ కోర్టు న్యాయమూర్తి  ఈ నెల 22కు వాయిదావేశారు.  అలాగే అలాగే, హెటిరో, అరబిందో వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సహ నిందితుడిని అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరడంతో విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement