Saturday, April 27, 2024

అమిత్ షాను కలవనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కాసేపట్లో కలవనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు అమిత్ షా వెంకట్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి, కేంద్రం సాయం కోరేందుకే తాను అమిత్ షాను కలవనున్నట్లు తెలిపారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. వెంకట్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవనుడడంతో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement