Wednesday, April 24, 2024

క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అందరినీ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement