Sunday, May 12, 2024

సీఎల్పీలో కోమ‌టిరెడ్డి ..వీహెచ్ లు భేటీ..ఎందుకో తెలుసా..

హైద‌రాబాద్ : సీఎల్పీలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, వీహెచ్ లు భేటీ అయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌లాపాల‌కు గ‌త కొంత‌కాలంగా కోమ‌టి రెడ్డి దూరంగా ఉంటున్నారు. కాగా కోమ‌టిరెడ్డికి న‌చ్చ‌జెప్పే బాధ్య‌త‌ను పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ వీహెచ్ కి అప్ప‌గించింది. కాగా కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులలో ప్ర‌ముఖులు. గ‌త తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. కోమ‌టిరెడ్డి న‌ల్గొండ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయ కార్య‌కల‌పాల్లో ఆయ‌న చురుగ్గా పాల్లొనేవారు. యువ‌జ‌న కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొదలు పెట్టారు. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారాయ‌న‌. మ‌రి వీహెచ్ ఏ మేర‌కు ఆయ‌న్ని బుజ్జ‌గిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement