Tuesday, April 30, 2024

Breaking: టీ 20 సిరీస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్

జూన్ 9 నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి. సౌతాఫ్రికా టూర్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను నియమించింది. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. అలాగే జట్టులోకి పాండ్యా, దినేష్ కార్తీక్ లు ఎంటరయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ జట్టులో ఉంటారు. టీ 20 జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ తో పాటు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఆడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement