Monday, May 13, 2024

Exclusive | ఈసారి ఖైరతాబాద్​ గణపయ్య ఇలా ఉంటడు.. శ్రీ దశమహా విద్యా గణపతిగా పూజలు!

గణేష్‌ చవితి అనగానే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడే. ఏటా భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు. కాగా, ఈ సారి భక్తుల పూజలు అందుకునే గణపతి రూపాన్ని వెల్లడించారు నిర్వాహకులు. ఈ సారి 69 అడుగుల మట్టి గణపయ్య భక్తుల దీవెనలు అందుకోనున్నారు.
– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వినాయక చవితి దగ్గర పడుతున్నందన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణంపై ఆసక్తి పెరుగుతోంది. గత ఏడాది పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మి గ‌ణ‌ప‌తిగా భక్తులకు దర్శనమిచ్చిన గణపయ్య ఈ సారి శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఖైరతాబాద్​ ఉత్సవ కమిటీ వేగవంతం చేస్తోంది.

1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేశుడి చరిత్ర 68 అడుగుల ఎత్తు వరకు కొనసాగింది. గడిచిన చాలా సంవత్సరాల్లో ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ పీవోపీ గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టిస్తూ వచ్చారు. గత రెండేండ్లుగా మాత్రం మట్టితో గణపతిని ప్రతిష్టించారు. ఈ సారి కూడా మట్టితోనే విగ్రహాన్ని తయారు చేయనున్నట్టు ఉత్సవ కమిటీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement