Wednesday, May 22, 2024

బీజేపీ స్టింగ్ ఆపరేషన్ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ స్టింగ్ ఆపరేషన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలుంటే అరెస్ట్ చేయాలన్నారు. లిక్కర్ స్కాం ఏంటో అర్థం కావడం లేదన్నారు. కోట్లాది రూపాయల స్కాం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, మనీశ్ సిసోడియా ఇంట్లో ఏమీ దొరకలేదన్నారు. కేంద్రానికి సీబీఐ, ఈడీపై ఉన్న ధ్యాస పాజిటివ్ పనులపై లేదన్నారు. 24 గంటలూ సీబీఐ, ఈడీ దాడులతో అందరినీ భయపెట్టిస్తున్నారన్నారు. ఇలాగైతే దేశం బాగుపడేదెలా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement