Tuesday, April 30, 2024

శ్రీవారిని కుటుంబ‌స‌మేతంగా ద‌ర్శించుకున్న క్రీడాకారిణి పీవీ సింధూ

ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధూ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సింధూ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందని..కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని..వచ్చే ఏడాది పలు టోర్నమెంట్లలో పాల్గొంటానని సింధూ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement