ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు సీఎం కేజ్రీవాల్. గత నెల 12న అహ్మదాబాద్లో నిర్వహించిన ‘ఆప్’ సమావేశానికి విక్రమ్ దంతాని తోటి ఆటో డ్రైవర్లతో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కేజ్రీవాల్కు తాను వీరాభిమానినని పేర్కొన్నాడు. కేజ్రీవాల్ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించాడు. అది విన్న కేజ్రీవాల్ సరేనంటూ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత ఆయన భోజనానికి వెళ్లారు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. కేజ్రీవాల్ను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన విక్రమ్ దంతాని అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ బ్యాడ్జ్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసిన మీడియా ‘ఇదేంటని’ ప్రశ్నించింది. స్పందించిన విక్రమ్.. తాను నిజానికి బీజేపీ అభిమానినని పేర్కొన్నాడు. రానున్న ఎన్నికల్లో తన ఓటు బీజేపీకేనని స్పష్టం చేశాడు. కేజ్రీవాల్ను ఓ అతిథిగానే ఇంటికి ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు. కేజ్రీవాల్తో భేటీ తర్వాత ఆప్ నాయకులెవరూ తనను కలవలేదన్న ఆయన.. తనకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేది బీజేపీ కార్యకర్తలేనని వివరించాడు.
ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన కేజ్రీవాల్-తన ఓటు మాత్రం బిజెపికేనన్న విక్రమ్ దంతాని
Advertisement
తాజా వార్తలు
Advertisement