Thursday, April 25, 2024

5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

భారత్‎లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది.ముందుగా 13 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. వాటిలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగావ్, హైదరాబాద్, జామ్ నగర్, లక్నో, పుణె నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన నగరాల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి దశల వారీగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement