Saturday, May 18, 2024

కేసీఆర్ మ‌ద్ద‌తు కూడా సిన్హాకే!… శ‌ర‌ద్ ప‌వార్

విపక్షాల రాష్ట్రపతి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీగా కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన రెండో ద‌ఫా భేటీ అయిన విప‌క్షాలు సిన్హా అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.


ఈ క్ర‌మంలో విప‌క్షాల భేటీకి నేతృత్వం వ‌హించిన ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీఆర్ఎస్ మ‌ద్ద‌తు కూడా య‌శ్వంత్ సిన్హాకేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు భేటీలో భాగంగా తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడాన‌ని ప‌వార్ చెప్పారు. సిన్హా అభ్య‌ర్థిత్వానికి తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కేసీఆర్ చెప్పార‌ని ఆయ‌న తెలిపారు. అయితే కేసీఆర్ ఈ విషయమై టీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం వెలువడే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement