Wednesday, May 15, 2024

రెండో రోజు లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

రెండో రోజు లాభాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు..అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో పాటు దేశంలో నిన్న కరోనా కేసుల సంఖ్య తగ్గడం కూడా ప్రభావం చూపింది. ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని ప్రదర్శించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 934 పాయింట్లు లాభపడి 52,532కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 15,639కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను చవిచూశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 5.96 శాతం, ఎనర్జీ సూచీ 4.95 శాతం లాభపడ్డాయి. టైటాన్ (5.92%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.79%), టీసీఎస్ (3.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.87%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.70%). బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (-0.26%) మాత్రమే నష్టపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement