Friday, April 26, 2024

నేడు విచార‌ణ‌కు హాజ‌రుకాలేను – ఈడీకి క‌విత లేఖ‌

న్యూఢిల్లీ – లిక్క‌ర్ స్కామ్ లో విచార‌ణ‌కు ఎమ్మెల్సీ క‌విత హాజ‌రుకావ‌ల‌సి ఉంది..అయితే చివ‌రి క్ష‌ణంలో క‌విత తాను విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని ఈడి అధికారుల‌కు లేఖ పంపారు.. క‌విత ప్ర‌తినిధి ,బి ఆర్ ఎస్ పార్టీ కార్య‌ద‌ర్శి సోమా భ‌ర‌త్ ఒక లే్‌ఖ‌ను ఈడి అధికారులకు అంద‌జేశారు.. త‌న పిటిష‌న్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నందున తాను విచార‌ణ‌కు హాజ‌రు కాలేక‌పోతున్న‌ట్లు ఆ లేఖ‌లో క‌విత పేర్కొన్నారు.. అలాగే తాను అనారోగ్యంతో ఉన్న కార‌ణంగా కూడా విచార‌ణాధికారుల ముందుకు రాలేక‌పోతున్నాన‌ని పేర్కొన్నారు.. ఈ లేఖ‌పై స్పందించిన ఈడీ అమె అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రించారు..దీంతో క‌విత హాజ‌రు పై స‌స్పెన్స్ కొన‌సాగుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement