Tuesday, May 7, 2024

Karnataka: లాడ్జిలో లవర్​, మర్డర్​ కేసు నిందితుడి ఎంజాయ్​.. హెల్ప్​ చేసిన పోలీసులపై కేసు!

ఓ మర్డర్​ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి తన ప్రియురాలితో కలిసి లాడ్జిలో టైమ్​ స్పెండ్​ చేయడానికి పోలీసులే సహకరించారు. ఇది కర్నాటక రాష్ట్రం వాయవ్య ధార్వాడ్​లో జరిగింది. శనివారం ఒక లాడ్జిలో తన ప్రియురాలితో గడపడానికి హత్య కేసులో నిందితుడిని అనుమతించినందుకు కర్నాటక పోలీసుల్లోని కొంతమంది సిబ్బందిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటన ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. ఆగస్టు 20న ( శనివారం) ఈ ఘటన జరగగా.. విచారణలో ఉన్న నిందితుడు బచ్చా ఖాన్‌పై కూడా కేసు నమోదు చేశారు. అతడిని ధార్వాడ్‌లోని కోర్టులో హాజరుపరిచారు.

కాగా, దీనికి బాధ్యులైన పోలీసు అధికారులు గార్డుల వలె వ్యవహరించారని, గదికి రక్షణ కల్పించారని తెలుస్తోంది. నిందితుడు తన ప్రియురాలితో లాడ్జిలో ఉండటానికి అనుమతించినట్టు సమాచారం.. ఇక.. నిందితుడి స్నేహితురాలు బెంగళూరుకు చెందిన వ్యక్తిఈ గదిని బుక్ చేసింది. వీరిద్దరూ కలసి గడుపుతున్న సమయంలో విద్యాగిరి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు.

అయితే.. బచ్చా ఖాన్‌ను మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సహాయం చేశారన్న ఆరోపణలపై పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇర్ఫాన్ అలియాస్ ఫ్రూట్ ఇర్ఫాన్ హత్యకేసులో ఇతడు ప్రమేయం ఉన్నాడని, దీంతో అతడిని హుబ్బళ్లిలో అరెస్టు చేసినట్లు సమాచారం. ఆగస్టు 2020లో ఆస్తి వివాదంలో ఇర్ఫాన్ హత్యకు గురైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement