Sunday, April 28, 2024

పెరిగిన కరోనా కేసులు.. రాష్ట్రంలో మళ్లీ కర్ఫ్యూ

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయంటూ దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కేరళతో సరిహద్దులో ఉన్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలను అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌.. అక్కడేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement