Thursday, March 28, 2024

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష విధించిన హైకోర్టు

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌కు జైలు, రూ.వెయ్యి జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్‌ శేషగిరిబాబుకు రూ.వెయ్యి జరిమానా, రెండు వారాల జైలు శిక్ష ఎస్‌.ఎన్‌.రావత్‌కు నెల రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా, మరో ఐఏఎస్ అధికారి ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానా విధించింది. మరో ఐఏఎస్ అధికారికి కూడా శిక్ష విధించింది.

నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ దగ్గర భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినా చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో ఐఏఎస్‌ అధికారుల జీతాల నుంచి కట్‌ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ శిక్షపై అప్పీల్‌ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్ఫెండ్‌ చేసింది.

ఈ వార్త కూడా చదవండి: చంద్రబాబు, లోకేష్‌పై మండిపడ్డ లక్ష్మీపార్వతి

Advertisement

తాజా వార్తలు

Advertisement