Saturday, May 4, 2024

Tollywood Drugs Case: ఈడీ విచారణకు రకుల్ ప్రీత్‌సింగ్ దూరం?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ దూరమయ్యేలా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్‌సింగ్ విచారణకు హాజరు కావాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ఈడీ అధికారులను కోరింది.

ఈడి విచారణకు తాను హాజరయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ అధికారులను కోరింది. అటు ఎక్సైజ్ అధికారుల విచారణలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేకున్నా.. డ్రగ్స్ కేసుతో పలు లింకులు ఉన్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ వార్త కూడా చదవండి: పవన్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపిన సైబరాబాద్ పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement