Friday, April 26, 2024

కర్ణాటకలో కొత్త కేబినెట్.. డిప్యూటీ సీఎంలకు నో ఛాన్స్

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గంలో 29 మందికి చోటు కల్పించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంలు ఉండరని సీఎం బొమ్మై స్పష్టం చేశారు. యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అయితే ఈ దఫా డిప్యూటీ సీఎంలు అవసరం లేదని పార్టీ నాయకత్వం ఆదేశించిందని సీఎం బొమ్మై తెలిపారు.

ఇటీవల యడియూరప్ప రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. తాజాగా 29 మందితో బొమ్మై తన మంత్రివర్గం ఏర్పాటు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బసవరాజ్ బొమ్మై ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై ఆయన పార్టీ అధిష్టానంతో చర్చించారు. త‌న కేబినెట్లో ఎవ‌రుండాల‌నే అంశం గురించి వారి ఆదేశాల‌ను తీసుకుని బొమ్మై బెంగ‌ళూరుకు చేరారు. బొమ్మై మంత్రివర్గంలో ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్‌సీలు, ఒక్క ఎస్టీ, రెడ్డితోపాటు లింగాయత్ వర్గానికి అధిక ప్రాధాన్యాం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ పదవిపై రగులుతున్న గులాబీ సైన్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement