Thursday, May 2, 2024

అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం – ఇద్ద‌రు మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న ముంబైలోని నానాచౌక్ ప్రాంతంలో భాటియా ఆసుప‌త్రి స‌మీపంలోని క‌మ‌లా బిల్డింగ్ లో చోటు చేసుకుంది. ఉద‌యం 7.30 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో మంట‌లు చెల‌రేగాయి. 13 ఫైర్ ఇంజ‌న్స్ ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లెవల్-3 ప్రమాదంగా దీన్ని గుర్తించారు. ఐదు అంబులెన్స్ లు కూడా చేరుకున్నాయి. ఇద్దరు మరణించారని, పలువురికి గాయాలైనట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement