Saturday, April 27, 2024

puneeth rajkumar: బెంగళూరుకు టాలీవుడ్ హీరోలు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పునీత్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పునీత్ కు తెలుగు హీరోలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మెగా కుటుంబంతోపాటు నందమూరి ఫ్యామిలీతో పునీత్ రాజ్ కుమార్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పనీత్ కు నివాళి అర్పించేందుకు హీరో బాలకృష్ణ బెంగళూరుకు వెళ్లారు. మధ్యాహ్నం చిరంజీవి, సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్తున్నారు. పునీత్ మృతదేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి కుటుంబానికి తొలి నుంచి అనుబంధం ఉంది. దివంగత ఎన్టీఆర్ కు దివంగత రాజ్ కుమార్ తో ఆత్మీయ సంబంధాలు ఉన్నారు. అలాగే, రాజ్ కుమార్ కుటుంబంతో చిరంజీవికి కూడా సాన్నిహిత్యం ఉంది. కాగా, జూనియర్ ఎన్టీఆర్- పునీత్ రాజ్ కుమార్ ల మధ్య వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. పునీత్ సినిమాలో ‘గెలయా గెలయా’ అనే పాటను సైతం పాడి అల్లరించారు.

ఇది కూడా చదవండి: తండ్రి సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు

Advertisement

తాజా వార్తలు

Advertisement