Sunday, May 5, 2024

Jhanvi kapoor: తిరుమలలో అతిలోక సుందరి.. శ్రీదేవి కూతురుని ఇలా ఎప్పుడైనా చూశారా?

అతిలోక సుందరి దివగంత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన స్నేహితురాలితో కలిసి తిరుమలను సందర్శించింది. ఎప్పుడు హాట్ హాట్ గా ఉండే జాహ్నవి.. హిందు సంప్రదాయాలను గౌరవిస్తూ.. అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీ వేసుకుని శ్రీవారిని దర్శించుకుంది. జాహ్నవికి అర్చకులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమలలో జాన్వీని చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. జాన్వీ తన స్నేహితురాలితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకోవడం అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో జాన్వీకపూర్ నటిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement