Sunday, April 28, 2024

జమ్ముకశ్మీర్‌లో 175 మంది ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నది. ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌ సింగ్‌ గురువారం మీడియాకు వివరించారు. 2021 మార్చి 1 నుంచి 2020 మార్చి 16 వరకు జమ్ముకశ్మీర్‌లో 175 మంది ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్‌ మట్టుబెట్టిందని తెలిపారు. అదే సమయంలో మావోయిస్ట్‌ ప్రభావిత రాష్ట్రాల్లో 19 మంది మావోయిస్టులను సీఆర్పీఎఫ్‌ హతమార్చడంతోపాటు 699 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement