Wednesday, May 15, 2024

జైలు నుంచే నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేసిన ఎస్పీ కీల‌క నేత ‘ఆజంఖాన్’

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాంపూర్ స‌ద‌ర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు స‌మాజ్ వాదీ పార్టీ కీల‌క నేత ఆజంఖాన్. ఈ మేర‌కు ఆయ‌న జైలు నుంచే నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేయ‌డం విశేషం. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న సీతాపూర్ జైల్లో ఉన్నారు. భూకబ్జాలతో పాటు ఇతర ఆరోపణలపై 2020 ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. ఆజంఖాన్ నామినేషన్ వేసినట్టు ఆయన చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా వెల్ల‌డించారు. ఆయనను బెయిల్ పై బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామనిన్నారు. మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు. ఆజంఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించినా… అఖిలేశ్ మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. యూపీలో మాఫియా డాన్ లు తాము చట్టానికి అతీతమని భావిస్తుంటారని, నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారని… యోగి సీఎం అయిన తర్వాత వీరంతా భయంతో కాలాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. మరోవైపు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలవడనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement