Monday, May 6, 2024

మిమ్మ‌ల్ని మ‌ళ్లీ గెలిపించే బాధ్య‌త నాది : సీఎం కేసీఆర్

మిమ్మ‌ల్ని మ‌ళ్లీ గెలిపించే బాధ్య‌త నాదేన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. పార్టీ మీటింగ్ లో సీఎం కేసీఆర్ కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… నాయ‌కుల‌కు ఓపిక ఉండాల‌న్నారు. అలాగే చురుగ్గా ప‌నిచేయండ‌ని పిలుపునిచ్చారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికి ప‌ద‌వులు వ‌స్తాయ‌న్నారు. నామినేటెడ్ పోస్టుల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. ముందుగా తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు స్వాగ‌తం ప‌లికారు. కొత్త‌గా నియామ‌క‌మైన కార్పొరేష‌న్ చైర్మ‌న్లు కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు, కీలక నేతలు హాజ‌ర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement