Sunday, April 28, 2024

Exclusive | చందమామపై రోవర్​ జర్నీ స్టార్ట్ .. ఏనిమిది మీటర్లు ప్రయాణించిందన్న ఇస్రో

మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కి సంబంధించిన లేటెస్ట్ అప్​డేట్ ని ఇస్రో ఇవ్వాల (శుక్రవారం) కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది సుమారు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. అలాగే రోవర్‌లోని పేలోడ్‌లు, ఎల్‌ఐబీఎస్‌, ఏపీఎక్స్‌ఎస్‌లను ఆన్‌ చేసినట్లు చెప్పింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌తోపాటు రోవర్‌లోని అన్ని పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.

మరోవైపు.. చంద్రుడిపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకు వచ్చేందుకు యంత్రంలోని 26 భాగాలు సహాయపడినట్లు ఇస్రో తెలిపింది. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి చేసి రోవర్‌కు శక్తిని ఇచ్చే సోలార్ ప్యానల్ అత్యంత కీలకమైనదని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్‌పై అన్ని దేశాలు దృష్టిసారించాయి. దీంతో చంద్రుడి నేలపై ప్రయాణం ప్రారంభించిన రోవర్‌ ప్రజ్ఞాన్ పంపనున్న ఫోటోలు, అది అందించే సమాచారం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement