Thursday, May 2, 2024

ఇస్కాన్ అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఆధునిక కిచెన్ – ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

రెండు గంటల్లో 50వేల‌మందికి భోజ‌నం అందించేలా ఇస్కాన్ అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఆధునిక కిచెన్ ని ఏర్పాటు చేసింది. ఈ కిచెన్ ని సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. కాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20 కోట్లతో ఈ కిచెన్ ను ఏర్పాటు చేశారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది. కిచెన్ ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలను సిద్ధం చేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. సీఎం అక్కడినుండ‌బి కొలనుకొండ వెళ్లి.. ఇస్కాన్ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. రూ.70 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రాధాకృష్ణులు, వెంకటేశ్వరస్వామి ఆలయాలను అందులో నిర్మిస్తున్నారు. వాటితో పాటు ధ్యాన మందిరాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

https://twitter.com/YSRCParty/status/1494556024249880576

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement