Saturday, April 20, 2024

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడ్డారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు నివాసంలో దోపీడీకి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుకు ఉంగుటూరు మండలం ఆమదాలపల్లిలో సొంత నివాసముంది. ఇక్కడ ఆయన బంధువులు నివాసముంటున్నారు. అయితే గ‌త‌ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దొంగలు పడి లక్షన్నర నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement