Thursday, May 2, 2024

Flash: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ పోలాండ్‌కు తరలింపు

రష్యా-ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని పోలాండ్ కు తరలించారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.

దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో దాడులతో సహా ఉక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌లో తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement