Tuesday, April 30, 2024

Corona Update: దేశంలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు

దేశంలో ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయ పెడుతున్న వేళ.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా నుంచి 9,265 మంది కోలుకున్నారు. మ‌రో 393 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 93,277 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య‌  559 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. క‌రోనాతో మొత్తం 4,75,128 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన కేసుల సంఖ్య 3,46,82,736కి చేరింది. ఇందులో 3,41,14,331 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. శుక్రవారం 76,36,569 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement