Thursday, May 16, 2024

Ashes 2021: ఇంగ్లండ్‌పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆది నుంచి తడబడి చివరికి ఓటమి పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ జట్టు దారుణంగా విఫలం కావడంతో మ్యాచ్ నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలగా, ఆస్ట్రేలియా ఏకంగా 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన 39 పరుగులే చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 152 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సయమానికి రెండు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అయితే, ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో నాలుగో రోజు ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయింది. 77 పరుగులు మాత్రమే చేసి మిగతా 8 వికెట్లను చేజార్చుకుంది. మలాన్ 82, రూట్ 89 పరుగులు చేసి అవుటయ్యారు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 297 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 20 పరుగులే అవసరం కాగా,  ఓపెనర్ అలెక్స్ కేరీ (9) వికెట్‌ను కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement